రైల్వే ట్రాక్ను పేల్చేసిన మావోయిస్టులు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
మావోయిస్టు కీలక నేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్దా అరెస్ట్ను నిరసిస్తూ శనివారం దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఝార్ఖండ్లో దుశ్చర్యకు పాల్పడ్డారు.
లతేహర్ (ఝార్ఖండ్): మావోయిస్టు కీలక నేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్దా అరెస్ట్ను నిరసిస్తూ శనివారం దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఝార్ఖండ్లో దుశ్చర్యకు పాల్పడ్డారు. ఝార్ఖండ్లోని లతేహర్, పశ్చిమ సింగ్బుమ్ జిల్లాల పరిధిలోని రెండు వేర్వేరు చోట్ల రైల్వే ట్రాక్లను పేల్చివేశారు. ఇది సీపీఐ (మావోయిస్టు) పార్టీ పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో బార్ఖాకానా- గర్హ్వా, హౌరా -మంబయి మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
దక్షిణ తూర్పు రైల్వే (ఎస్ఈఆర్) చక్రధర్పూర్ డివిజన్ సింగ్బుమ్ జిల్లా పరిధిలోని లోతాపహార్- సోనువా మధ్య రైల్వే ట్రాక్ను మావోయిస్టులు పేల్చివేశారు. శుక్రవారం రాత్రి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ట్రాక్ ధ్వంసం అవ్వడంతో హౌరా- ముంబయి మధ్య రైళ్లు నిలిచిపోయాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రత్యామ్నాయ రైల్వే ట్రాకుల ద్వారా రైళ్ల రాకపోకలు కొనసాగాయి. రెండుగంటల తర్వాత పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు.
తూర్పు మధ్య రైల్వే (ఈసీఆర్) పరిధిలోని ధన్బాద్ డివిజన్లోనూ లతేహార్ జిల్లాలో రిచుగుటా-డెమూ మధ్య శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 12.30 గంటల సమయంలో మరో ట్రాక్ను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో బార్ఖాకానా- గర్హ్వా మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో ఓ డీజిల్ ఇంజిన్ దెబ్బతింది. సుమారు పది గంటల తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పలు రైళ్లను దారి మళ్లించగా.. ఓ స్పెషల్ ట్రైన్ను రద్దు చేశారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?