నిప్పంటుకుని తల్లీకుమార్తె సజీవదహనం

మెదక్‌ పట్టణంలోని అజంపురా కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని తల్లీకుమార్తె సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. మెదక్‌

Updated : 05 Mar 2021 13:36 IST

మెదక్‌: మెదక్‌ పట్టణంలోని అజంపురా కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని తల్లీకుమార్తె సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ మండలం తిమ్మానగర్‌కు చెందిన గట్టయ్య సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా భార్య రేవతి, కుమార్తె ఆద్యశ్రీతో కలిసి మెదక్‌లోని అజంపురా కాలనీలో నివాసముంటున్నారు. రోజూ మాదిరిగానే గట్టయ్య విధులకు వెళ్లగా భార్య రేవతి ఇంట్లో వంటచేస్తున్న క్రమంలో ప్రమాదశాత్తూ చీరకు నిప్పంటుకుంది. రేవతితో పాటు ఆమె కుమార్తెకూ మంటలు అంటుకున్నాయి. కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే ఇద్దరూ తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని