Crime news: డివైడర్‌ పైకి దూసుకొచ్చిన బస్సు.. తెగిపడిన తల్లి కాళ్లు

రోడ్డు పక్కనున్న డివైడర్‌ పైకి బస్సు దూసుకువచ్చిన ఘటనలో తల్లీకొడుకులు తమ రెండు కాళ్లను కోల్పోయారు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని చంఢీచౌక్ వద్ద ఉన్న డివైడర్‌పై తల్లీకొడుకులు కూర్చొని ఉన్నారు....

Updated : 27 Feb 2024 15:22 IST

హరిద్వార్‌: రోడ్డు పక్కనున్న డివైడర్‌ పైకి బస్సు దూసుకువచ్చిన ఘటనలో తల్లీకొడుకులు తమ రెండు కాళ్లను కోల్పోయారు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని చండీచౌక్ వద్ద ఉన్న డివైడర్‌పై తల్లీకొడుకులు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో రాజస్థాన్ నుంచి ప్రయాణికులతో వస్తున్న ఓ బస్సు మలుపు తిరిగే క్రమంలో డివైడర్‌పైకి దూసుకొచ్చింది. దీంతో అక్కడే కూర్చున్న తల్లీకొడుకుల కాళ్లు బస్సుకి, డివైడర్‌కు మధ్య ప్రమాదకరంగా చిక్కుకుపోయాయి. కాళ్లు బయటకు తీయలేక వారిద్దరూ విలవిల్లాడారు. స్థానికులు అతికష్టం మీద బస్సును అవతలికి జరిపి క్షతగాత్రులను బయటకు లాగారు. అయితే బస్సు, డివైడర్‌కు మధ్య విపరీతంగా నలిగి తల్లి కాళ్లు  పూర్తిగా తెగిపోయాయి. కుమారుడి కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని