Crime News: కొడుకును కాపాడబోయి... అతనితోపాటు తల్లీ మృతి

నీటిలో మునిగిపోతున్న తనయుడిని కాపాడబోయి అతనితోపాటు తల్లి కూడా మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపారలో ఆదివారం జరిగింది. స్థానికురాలైన కవిత(35) తన మతిస్థిమితం లేని కొడుకు డిల్లీ(15)ని తీసుకుని దుస్తులు ఉతికేందుకు

Updated : 17 Jan 2022 07:22 IST

గుడిపాల, న్యూస్‌టుడే: నీటిలో మునిగిపోతున్న తనయుడిని కాపాడబోయి అతనితోపాటు తల్లి కూడా మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపారలో ఆదివారం జరిగింది. స్థానికురాలైన కవిత(35) తన మతిస్థిమితం లేని కొడుకు డిల్లీ(15)ని తీసుకుని దుస్తులు ఉతికేందుకు ఇంటికి సమీపంలోని అప్పాయగుంటకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ కుమారుడు కాలుజారి నీటిలో పడిపోగా కాపాడేందుకు ఆమె  చెరువులోకి దిగింది. అతడు తల్లిని గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరూ ఎంతసేపటికీ తిరిగి    రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ దుస్తులు ఉండటం, వారు కనిపించక పోవడంతో అనుమానంతో చెరువులో వెతకగా మృతదేహాలు దొరికాయి. దీనిపై పోలీసులకు రాత్రి పొద్దుపోయే వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని