
Crime news : ఒంగోలులో పట్టపగలే దారుణం!
ఒంగోలు: నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న జంట హత్యల కేసు కీలక మలుపు తిరిగింది. మీరాబీ, ఆమె కుమారుడు అలీఫ్ను చంపిన రబ్బానీ అనే వ్యక్తే ఒంగోలులో కాశీరావు అనే యువకుడిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అంబటివారిపాలెంలో మీరాబీ, ఆమె కుమారుడు అలీఫ్ను రబ్బానీ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఒంగోలుకు చేరుకొని రవిప్రియ మాల్ సమీపంలో ఉన్న కాశీరావుపై కత్తితో దాడి చేశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని స్థానిక రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నెల్లూరులో జంట హత్యలు, ఒంగోలులో కాశీరావుపై దాడికి కారణం అక్రమ సంబంధమే కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాశీరావు అనే యువకుడు గత కొన్ని రోజులుగా రబ్బానీ టీ షాప్లో పని చేస్తున్నాడు. బాధితుడికి మెడపై, పొట్టలో తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం.