మత్తుమందు ఇచ్చి నేపాలీ ముఠా చోరీ

నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో నేపాలీ ముఠా చోరీకి పాల్పడింది. ఇంటి యజమానికి మత్తుమందు ఇచ్చి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోవారు శుభకార్యానికి వెళ్లగా...

Updated : 20 Oct 2020 01:54 IST

హైదరాబాద్‌: నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో నేపాలీ ముఠా చోరీకి పాల్పడింది. ఇంటి యజమానికి మత్తుమందు ఇచ్చి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోవారు శుభకార్యానికి వెళ్లగా వృద్ధురాలికి  మత్తుమందు ఇచ్చారు. అనంతరం రూ.10 లక్షలు, 20 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అయితే 10 రోజుల క్రితమే ఈ నేపాలీ ముఠా ఆ ఇంట్లో పనిమనుషులుగా చేరారు. అనంతరం అదును చూసి దోపిడికి పాల్పడి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  నేపాలీ ముఠా కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇలాంటి చోరీ నగరంలో నెల రోజుల వ్యవధిలో రెండోసారి జరగడం చర్చనీయాంశమైంది. ఈనెల 5న రాయదుర్గంలో ఇదే తరహాలో నేపాలీ ముఠా చోరీకి పాల్పడింది. దుండగుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు