CRIME NEWS: దగ్ధమైన కారు డిక్కీలో శవాన్ని గుర్తించిన పోలీసులు

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో హత్యకు గురైన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన దుండగులు

Updated : 11 Aug 2021 05:10 IST

వెల్దుర్తి: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో హత్యకు గురైన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన దుండగులు కారును దగ్ధం చేశారు. కారు డిక్కీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌ కుమార్‌, సీఐ స్వామిగౌడ్‌, నర్సాపూర్‌ సీఐ లింగేశ్వర్‌రావు, నారాయణపేట సీఐ నాగార్జున గౌడ్‌ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో చనిపోయిన వ్యక్తి వివరాలు తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది.

కారు ఇంజిన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెదక్‌ పట్టణంలోని ఓ సినిమా టాకీస్‌ యజమాని వాహనంగా దాన్ని గుర్తించారు. మృతుడు మెదక్‌కు చెందిన శ్రీనివాస్‌గా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో. మృతుడి నోటిలో ఉన్న కృత్రిమ దంతాల ఆధారంగా శ్రీనివాస్‌ను ఆయన భార్య హైందవి గుర్తించారు. భర్త హత్యపై ఆమె వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, శ్రీనివాస్‌ తనతో తరచూ గొడవ పడేవాడని హైందవి పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని