Mahesh Bank : మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్.. ముగ్గురి ఖాతాల్లోకి రూ.12.4 కోట్లు !
మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన 3 ఖాతాలను గుర్తించారు. ముగ్గురిలో ఇద్దరిని ఇప్పటికే ప్రశ్నించిన అధికారులు.. వారిద్దరికీ హ్యాక్తో సంబంధం లేదని తేల్చి...
హైదరాబాద్ : మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన 3 ఖాతాలను గుర్తించారు. ముగ్గురిలో ఇద్దరిని ఇప్పటికే ప్రశ్నించిన అధికారులు.. వారిద్దరికీ హ్యాక్తో సంబంధం లేదని తేల్చి చెప్పారు. వినోద్, నవీన్ అనే ఇద్దరు వ్యక్తుల ఖాతాల్లో సైబర్ నేరగాళ్లు నగదు జమచేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి ఖాతాల్లో రూ.5 కోట్లకు పైగా డిపాజిట్ చేసినట్లు గుర్తించామన్నారు. అయితే ఆ ఇద్దరి ఖాతాల నుంచి నగదును సైబర్ నేరగాళ్లు ఇతర ఖాతాల్లోకి మార్చారన్నారు.
మరో వ్యక్తి షానవాజ్ ఖాతాలో రూ.6.9కోట్లు జమచేసిన సైబర్ నేరగాళ్లు.. అక్కడి నుంచి ఇతరుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేశారన్నారు. ఫోన్ స్విఛావ్ కావడంతో షానవాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడి చరవాణిని సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషిస్తున్నారు. షానవాజ్ కొన్ని నెలల క్రితం ముంబయిలో ఉన్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు షానవాజ్ సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 3 ఖాతాల నుంచి రూ.12.4 కోట్ల మొత్తాన్ని నేరగాళ్లు ఇప్పటికే 128 ఖాతాలకు బదిలీ చేశారు. మరో 200 ఖాతాలకు బదిలీ కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల పరిశీలనకు రెండ్రోజుల్లో తెలంగాణ పోలీసులు కోల్కతా వెళ్లనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాలను సైతం పరిశీలించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు