Crime news: గర్భిణిపై అమానుషం.. గ్యాంగ్ రేప్ చేసి రైలు పట్టాలపై పడేశారు!
వాకింగ్కు వెళ్లిన గర్భిణిపై ముగ్గురు మానవ మృగాళ్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహ కోల్పోయిన గర్భిణి పట్ల కనీస కనికరం కూడా చూపకుండా నిర్దయగా రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు.
పట్నా: బిహార్లోని పట్నా నగరంలో ఓ గర్భిణిపై దారుణం చోటుచేసుకుంది. వాకింగ్కు వెళ్లిన ఆమెపై ముగ్గురు మానవ మృగాళ్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహ కోల్పోయిన గర్భిణి పట్ల కనీస కనికరం కూడా చూపకుండా నిర్దయగా రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు. ఈ అమానుష ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24ఏళ్ల మహిళ శనివారం రాత్రి తన ఇంటి సమీపంలో వాకింగ్కు వెళ్లింది. ఆమెను అనుసరించిన ఇద్దరు యువకులు గర్భిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం ఆమె నోటిని గట్టిగా మూసేసి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం మరో వ్యక్తిని పిలిచి ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు దారుణానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించగా దాడి చేశారు. దీంతో స్పృహ కోల్పోవడంతో మహిళను రైల్వే ట్రాక్ వద్ద వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమెకు స్పృహ వచ్చింది. గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆమెను మహిళా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం వైద్య పరీక్షలు చేసి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులైన విశాల్, అంకిత్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మూడో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.