Medak: మంగళసూత్రాన్ని మాయం చేసిన పురోహితుడు
మెదక్ జిల్లా పడాలపల్లిలో జరిగిన ఓ వివాహవేడుకలో పురోహితుడే చేతివాటం ప్రదర్శించడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. వేదమంత్రాలు ఉచ్ఛరిస్తూ వివాహ తంతు జరిపించే పురోహితుడే ఏకంగా మంగళసూత్రాన్ని మాయం చేశాడు....
తూప్రాన్: మెదక్ జిల్లా పడాలపల్లిలో జరిగిన ఓ వివాహవేడుకలో పురోహితుడే చేతివాటం ప్రదర్శించడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. వేదమంత్రాలు ఉచ్ఛరిస్తూ వివాహ తంతు జరిపించే పురోహితుడే ఏకంగా మంగళసూత్రాన్ని మాయం చేశాడు. పెళ్లి అయిపోయాక వధువు మెడలో పుస్తెలతాడు లేదని గమనించిన కుటుంబసభ్యులు పురోహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మెదక్ జిల్లా తూప్రాన్లో ఈనెల 16న ఓ జంటకు వివాహం జరిగింది. పడాలపల్లికి చెందిన మునిరాతి పెంటయ్య, సుశీల దంపతుల కుమారుడు జ్ఞానేంధర్ దాసు, నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన వసంత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గజ్వేల్ కు చెందిన ఓ పురోహితుడు వీరి వివాహం జరిపించాడు. అయితే అమ్మాయి మెడలో వేయాల్సిన 3 తులాల బంగారు పుస్తెలతాడును పురోహితుడు జేబులో వేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. ఈ దృశ్యాలు కూడా పెళ్లి వీడియోలో రికార్డయ్యాయని పేర్కొంటున్నారు. రెండు రోజులుగా పురోహితుడికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందని.. నేరుగా ఇంటికి వెళ్లి అడిగితే కుటుంబ సభ్యులు తమకు తెలియదంటున్నారని వాపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిపిస్తుండగా పురోహితుడు జేబులో పుస్తెలతాడు వేసుకుంటున్న వీడియోను పరిశీలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)