Road Accident: విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్‌ బస్సు.. కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

Updated : 06 Oct 2022 15:00 IST

పాలక్కాడ్‌: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్‌ బస్సు.. కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. పాలక్కాడ్‌ జిల్లా వడక్కంచేరి వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. టూరిస్ట్‌ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 36 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని