Road Accident: టైరు పేలి బోల్తాపడిన కారు.. నలుగురి దుర్మరణం

హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వైపు వెళ్తున్న ఓ కారు టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తాపడింది.

Updated : 10 Aug 2022 12:16 IST

ముప్కాల్‌: హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వైపు వెళ్తున్న ఓ కారు టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్ బైపాస్‌ కొత్తపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలోనూ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు హైదరాబాద్‌లోని టోలిచౌకి వాసులుగా భావిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముప్కాల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని