Road Accident : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

Updated : 22 May 2022 11:31 IST

లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అంత్యక్రియలకు హాజరై బొలెరో వాహనంలో 11 మంది తిరిగి వస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిద్ధార్థ్‌నగర్‌ జిల్లాలోని జోగియా కొట్వాలి ప్రాంతంలో వీరి వాహనం అదుపుతప్పి ఆగివున్న ట్రక్కును ఢీకొంది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని