crime news: చిత్తూరులో వస్త్ర దుకాణంలో చోరీకి పాల్పడ్డ ఎస్సై, కానిస్టేబుల్‌ 

దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీసులే చోరీకి పాల్పడి విస్మయపరిచారు. చిత్తూరులోని వేలూరు రోడ్డులో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో ఎస్సై మహమ్మద్‌, కానిస్టేబుల్‌...

Updated : 12 Sep 2021 04:25 IST

చిత్తూరు: దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీసులే చోరీకి పాల్పడి విస్మయపరిచారు. చిత్తూరులోని వేలూరు రోడ్డులో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో ఎస్సై మహమ్మద్‌, కానిస్టేబుల్‌ ఇంతియాజ్‌ చోరీకి పాల్పడ్డారు. వస్త్ర దుకాణంలోని సీసీ కెమెరాలో ఈ చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో ఆ వస్త్ర దుకాణం వ్యాపారి సీసీ కెమెరా దృశ్యాలతో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని