ఆలస్యంగా వచ్చి.. సిబ్బందిపై దాడి

విమానాశ్రయానికి ఆలస్యంగా రావడంతో బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వని విమానాశ్రయ అధికారులపై ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో చోటుచేసుకుంది...

Updated : 18 Nov 2020 11:50 IST

అహ్మదాబాద్‌: విమానాశ్రయానికి ఆలస్యంగా రావడంతో బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వడానికి నిరాకరించిన విమానాశ్రయ అధికారులపై ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దుర్భాషలాడుతూ స్పైస్‌జెట్‌ అధికారులపై చేయిచేసుకున్నారు.

‘నవంబర్‌ 17న ముగ్గురు ప్రయాణికులు దిల్లీకి వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. అందులో ఓ పోలీసు అధికారి ఉన్నారు. కానీ వారు ఆలస్యంగా రావడంతో బోర్డింగ్‌ పాస్‌ ఇచ్చేందుకు నిరాకరించాం. దీంతో వారు కౌంటర్‌ వద్ద గొడవకు దిగారు’ అని విమానాశ్రయం అధికారులు ఓ న్యూస్‌ ఏజెన్సీకి వెల్లడించారు. తీవ్ర వాదనకు దిగిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అధికారులపై చేయిచేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. 

ఇన్‌స్పెక్టర్‌ దాడికి పాల్పడటంతో విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అధికారులు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సైతం వెల్లడించారు. దీంతో ఆ ముగ్గురు ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందితో సంధి కుదుర్చుకున్నట్లు తెలిసింది. దీంతో అధికారులు వారిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని