ఆలస్యంగా వచ్చి.. సిబ్బందిపై దాడి
విమానాశ్రయానికి ఆలస్యంగా రావడంతో బోర్డింగ్ పాస్ ఇవ్వని విమానాశ్రయ అధికారులపై ఓ సబ్ఇన్స్పెక్టర్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది...
అహ్మదాబాద్: విమానాశ్రయానికి ఆలస్యంగా రావడంతో బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నిరాకరించిన విమానాశ్రయ అధికారులపై ఓ సబ్ఇన్స్పెక్టర్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దుర్భాషలాడుతూ స్పైస్జెట్ అధికారులపై చేయిచేసుకున్నారు.
‘నవంబర్ 17న ముగ్గురు ప్రయాణికులు దిల్లీకి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అందులో ఓ పోలీసు అధికారి ఉన్నారు. కానీ వారు ఆలస్యంగా రావడంతో బోర్డింగ్ పాస్ ఇచ్చేందుకు నిరాకరించాం. దీంతో వారు కౌంటర్ వద్ద గొడవకు దిగారు’ అని విమానాశ్రయం అధికారులు ఓ న్యూస్ ఏజెన్సీకి వెల్లడించారు. తీవ్ర వాదనకు దిగిన సబ్ ఇన్స్పెక్టర్ అధికారులపై చేయిచేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
ఇన్స్పెక్టర్ దాడికి పాల్పడటంతో విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్పోర్ట్ అధికారులకు, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అధికారులు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సైతం వెల్లడించారు. దీంతో ఆ ముగ్గురు ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందితో సంధి కుదుర్చుకున్నట్లు తెలిసింది. దీంతో అధికారులు వారిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు