విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై విషమిచ్చి హత్య

ఝార్ఖండ్‌లో ఓ దుర్మార్గపు టీచర్‌ అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై విషమిచ్చి హత్య చేసిన ఘటన విస్తుగొలుపుతోంది....

Published : 30 Jan 2021 00:45 IST

కీచక ఉపాధ్యాయుడి అరెస్టు

రాంచి: ఝార్ఖండ్‌లో ఓ కీచక టీచర్‌ అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై విషమిచ్చి హత్య చేసిన ఘటన విస్తుగొలుపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం... పలమౌ జిల్లాలోని పంకికి చెందిన బాలిక జనవరి 26 తేదీన పాఠశాలకు వెళ్లింది. కాగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంభు సింగ్‌ (35) బాలికను ఎవరూలేని తరగతి గదికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం పోలీసులకు తెలియజేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను సైతం హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా అదే రోజు రాత్రి విద్యార్థిని ఇంట్లోకి బలవంతంగా చొరబడి బాలికకు విషపు గోలీలు తినిపించాడు. దీంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తల్లిదండ్రులు తమ కూతురిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతిచెందింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక కుటుంబానికి, ఉపాధ్యాయుడికి మధ్య భూతగాదాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

చచ్చే ముందైనా.. ఏటీఎం పిన్‌ నెంబర్‌ చెప్పు

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని