Crime News: సరదాగా గడుపుదామని వచ్చి.. పోలీసులకు చిక్కిన విద్యార్థులు
చెడు వ్యసనాలకు బానిసైన ముగ్గురు విద్యార్థులు సరదాగా గడిపేందుకు గుంటూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో మత్తు పదార్థాలు సేవిస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసుల కథనం ప్రకారం..
గుంటూరు: చెడు వ్యసనాలకు బానిసైన ముగ్గురు విద్యార్థులు సరదాగా గడిపేందుకు గుంటూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో మత్తు పదార్థాలు సేవిస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం బ్రాడీపేట నాలుగో లైనులో ఓ లాడ్జిపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, 3 ఎల్ఎస్డీ స్రిప్పులు, రూ.8వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా గడుపుదామని గుంటూరు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వీరికి డ్రగ్స్ విక్రయించిన హైదరాబాద్కు చెందిన రేవంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల అరెస్టు వివరాలను డీఎస్పీ సుప్రజ మీడియా సమావేశంలో వివరించారు. విద్యార్థుల నడవడికను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా డీఎస్పీ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి