Crime news: కర్కోటకుడిగా మారిన కన్నతండ్రి.. మద్యం మత్తులో దాష్టీకం
చిన్నారి బోసినవ్వులతో కళకళలాడాల్సిన ఆ ఇంట మరణమృదంగం మోగింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పసిబిడ్డను మద్యంమత్తులో కన్న తండ్రే కసాయిగా మారి కడతేర్చిన ఘటన తీవ్ర విషాదం
మూడోసారీ ఆడపిల్ల పుట్టిందని నేలకేసి కొట్టడంతో శిశువు మృతి
నిందితుడు బాపురావు
కాగజ్నగర్ గ్రామీణం, వాంకిడి, న్యూస్టుడే: చిన్నారి బోసినవ్వులతో కళకళలాడాల్సిన ఆ ఇంట మరణమృదంగం మోగింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పసిబిడ్డను మద్యంమత్తులో కన్న తండ్రే కసాయిగా మారి కడతేర్చిన ఘటన తీవ్ర విషాదం నింపింది. మూడో సంతానం కూడా ఆడపిల్లే పుట్టిందని ఓ తండ్రి శిశువును నిర్దాక్షిణ్యంగా నేలకు కొట్టి బలితీసుకున్న హృదయవిదారక సంఘటన కుమురం భీం జిల్లా మారుమూల గిరిజన గ్రామమైన లైన్గూడలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కాగజ్నగర్ గ్రామీణ ఎస్సై రామ్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్నగర్ మండలంలోని లైన్గూడ పంచాయతీ కేంద్రానికి చెందిన గిరిజన దంపతులు మెస్రం బాపురావు-మనీషాలకు ఇద్దరు ఆడపిల్లలు మౌనిక(5), అశ్విని(3) ఉన్నారు. 45 రోజుల కిందట మూడో సంతానంగా ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి బాపురావు రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. సోమవారం రాత్రి అతడు బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మౌనిక, అశ్విని టీవీ చూసేందుకు పక్కింటికి వెళ్లారు. ఇంట్లో మనీషాతో పాటు చిన్నారి ఉంది. భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది. మత్తులో విచక్షణ కోల్పోయిన బాపురావు మంచంపై నిద్రిస్తున్న పసిపాపను బయటికి తీసుకొచ్చి నేలకు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత సర్పంచి ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. ఆమె ఇచ్చిన సమాచారంతో నిందితుడిని వాంకిడి పోలీసులు అదుపులో తీసుకున్నారు. మంగళవారం కాగజ్నగర్ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా