Crime News: తాను ప్రేమిస్తున్న యువతిని బైకుపై ఎక్కించుకున్నాడని కత్తితో దాడి..

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పాల బూత్‌ యజమాని సురేశ్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

Updated : 18 Sep 2021 15:09 IST

జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పాల బూత్‌ యజమాని సురేశ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిన్న అర్ధరాత్రి సురేశ్‌ తన పాల బూత్‌లో పని చేస్తున్న యువతిని బైక్‌పై ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టాడు. తాను ప్రేమిస్తున్న యువతిని సురేశ్‌ బైకుపై ఎక్కించుకున్నాడనే కోపంతో ఓ యువకుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సురేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సురేశ్‌ మృతిచెందారు. ఘటన అనంతరం దాడి చేసిన యువకుడు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని