TS News: పెళ్లి పేరుతో 19 మంది మహిళలకు మోసం.. 

పెళ్లి పేరుతో నల్గొండలో మహిళలను మోసం చేసిన విలియమ్స్‌ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

Updated : 09 Nov 2021 16:42 IST

గుండెపోటంటూ ఆస్పత్రిలో చేరిక

నల్గొండ: పెళ్లి పేరుతో నల్గొండలో మహిళలను మోసం చేసిన విలియమ్స్‌ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. స్థానికంగా ఉండే ఓ చర్చిలో పియానో వాయించే ఇతను పలువురు మహిళలను మోసం చేసినట్లు తెలుస్తోంది. చర్చికి వచ్చే యువతులు, మహిళలను విలియమ్స్‌ లోబరుచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదటి భార్య పోలీసులను ఆశ్రయించడంతో విలియమ్స్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. 19 మంది మహిళలను మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. కాగా తనకు గుండెపోటు వచ్చిందంటూ విలియమ్స్‌ ఓ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు