Suicide: బావమరిది మృతితో మనస్తాపం.. బావ బలవన్మరణం

బావమరిది బలవన్మరణం  తట్టుకోలేక మనస్తాపానికి గురైన బావ ఆత్మహత్య చేసుకున్న ఘటన తూప్రాన్‌ మండలం నాగులపల్లి పంచాయతీ పరిధి జెండాపల్లిలో చోటుచేసుకుంది...

Published : 09 Nov 2021 07:31 IST

తూప్రాన్‌, న్యూస్‌టుడే: బావమరిది బలవన్మరణం  తట్టుకోలేక మనస్తాపానికి గురైన బావ ఆత్మహత్య చేసుకున్న ఘటన తూప్రాన్‌ మండలం నాగులపల్లి పంచాయతీ పరిధి జెండాపల్లిలో చోటుచేసుకుంది. తూప్రాన్‌ ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. జెండాపల్లి గ్రామానికి చెందిన నాగులూరి శంకర్‌, నర్సమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కొడుకు ప్రశాంత్‌ (22) తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. నెల రోజుల క్రితం శివ్వంపేట మండలం చండి గ్రామానికి చెందిన తన బావమరిది శ్రీశైలం ఆత్మహత్య చేసుకున్నారు. అతడితో ఎంతో సన్నిహితంగా ఉండే ప్రశాంత్‌ ఈ ఘటనతో మనోవేదనకు గురయ్యాడు. తన మిత్రుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం ప్రశాంత్‌ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన కుటుంబీకులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు తండ్రి శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని