Crime News: ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి
ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. ప్రేమించమంటూ వేధించి యువతి గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఘటన రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం జరిగింది. గోదావరిఖని రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం
గొంతు కోసి హతమార్చిన యువకుడు
మృతురాలు అంజలి, నిందితుడు రాజు
గోదావరిఖని-యైటింక్లైన్కాలనీ, న్యూస్టుడే: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. ప్రేమించమంటూ వేధించి యువతి గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఘటన రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం జరిగింది. గోదావరిఖని రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం యైటింక్లైన్కాలనీ కేకేనగర్కు చెందిన గొడుగు అంజలి(20) తండ్రి ఆమె చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి లక్ష్మి కూలీ పని చేస్తూ కుమార్తెని పోషిస్తోంది. తల్లి పనికి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన చాట్ల రాజు (20) అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ప్రేమిస్తున్నానంటూ వేధించడం మొదలుపెట్టాడు. విషయం లక్ష్మికి తెలియడంతో రాజును ఇంటికి రావద్దని హెచ్చరించింది. ఏడాది కిందట పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఈమధ్య అంజలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలుసుకున్న రాజు ఫోన్చేసి వేధించడం మొదలుపెట్టాడు. ఆమె నుంచి స్పందన రాకపోవడంతో పగ పెంచుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం అంజలి ఇంటికి వెళ్లి ఆమెతో ఘర్షణకు దిగాడు. కేకలు బయటకు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచాడు. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి, అక్కడే ఉన్న కత్తిపీటతో దాడి చేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. లక్ష్మితో కలిసి కూలీ పని చేసే వ్యక్తి ఒకరు ఉపాధిహామీ జాబ్కార్డు ఇచ్చేందుకు మంగళవారం మధ్యాహ్నం వారి ఇంటికి వచ్చాడు. ఎంత పిలిచినా ఎవరూ పలకకపోవడం, టీవీ సౌండ్ పెద్దగా వినిపిస్తుండటంతో లోపలికి వెళ్లిన అతడికి రక్తపు మడుగులో పడి ఉన్న అంజలి కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ గిరిప్రసాద్, సీఐ శ్రీనివాసరావు పరిశీలించి, విచారణ ప్రారంభించారు. నిందితుడు రాజు అంజలిని హత్య చేసిన అనంతరం పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు