Suicide: పాఠశాల బస్సు అందుకోలేకపోవడంతో.. విద్యార్థి ఆత్మహత్య!

పాఠశాల బస్సు అందుకోలేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని బేతూల్‌ జిల్లా ఘోరదోంగ్రీ మండలంలోని అమ్డోహ్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విద్యార్థి (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

Updated : 24 Nov 2021 06:44 IST

 

భోపాల్‌: పాఠశాల బస్సు అందుకోలేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని బేతూల్‌ జిల్లా ఘోరదోంగ్రీ మండలంలోని అమ్డోహ్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విద్యార్థి (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే సోమవారం ఉదయం పాఠశాలకు బయలుదేరాడు. అతడు వెళ్లేసరికే బస్సు వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా బాధపడిన విద్యార్థి ఇంట్లోని మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని