Crime news: అటవీ సిబ్బందిపై పెట్రోల్ పోసిన పోడు సాగుదారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు భూముల స్వాధీనానికి వెళ్లిన ఆజంనగర్ అటవీశాఖ రేంజి అధికారి దివ్య, సిబ్బందిపై పోడు సాగుదారులు పెట్రోల్ పోసి దాడి చేసిన
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు భూముల స్వాధీనానికి వెళ్లిన ఆజంనగర్ అటవీశాఖ రేంజి అధికారి దివ్య, సిబ్బందిపై పోడు సాగుదారులు పెట్రోల్ పోసి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు గురువారం సాయంత్రం అటవీ అధికారులు పందిపంపుల గ్రామానికి వెళ్లారు. తమ భూముల్లో మొక్కలు నాటొద్దని నిరసన చేపట్టిన పోడు సాగుదారులు ఒక్కసారిగా దాడికి దిగారు. పెట్రోల్ పోసి దాడికి పాల్పడ్డారు. గతంలోనూ అధికారులు పోడు భూముల్లో నాటిన మొక్కలను సాగుదారులు తొలగించారు. దాడిలో స్వల్పంగా గాయపడిన అటవీ అధికారి దివ్య భూపాలపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం