Crime news: నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. వ్యక్తిపై రాడ్లతో దాడి

నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. చేజర్ల మండలం ఉలవపల్లిలో కొందరు

Updated : 18 Sep 2021 13:23 IST

చేజర్ల: నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. చేజర్ల మండలం ఉలవపల్లిలో కొందరు ఇసుక అక్రమ రవాణాకు యత్నించగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ దశలో రెచ్చిపోయిన ఇసుకాసురులు బొలిగర్ల జయరామయ్య అనే వ్యక్తిపై రాడ్లపై దాడి చేశారు. జయరామయ్య తలకు తీవ్రగాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా గురించి పోలీసులకు సమాచారమిచ్చినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని