AP News: ముగ్గురు విద్యార్థినుల కిడ్నాప్‌నకు యత్నం.. దుండగుల నిర్బంధం 

ముగ్గురు పాఠశాల విద్యార్థినులను దుండగులు కిడ్నాప్‌నకు యత్నించిన ఘటన విజయనగరం జిల్లా మెరకముడిదాం

Updated : 16 Sep 2021 13:34 IST

మెరకముడిదాం: ముగ్గురు పాఠశాల విద్యార్థినులను దుండగులు కిడ్నాప్‌నకు యత్నించిన ఘటన విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో చోటు చేసుకుంది. ఊటపల్లి నుంచి మెరకముడిదాంలోని ఉన్నత పాఠశాలకు సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు ట్రైసైకిల్‌లో ఎక్కిస్తుండగా అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించారు. దీంతో దుండగులు పారిపోవడానికి ప్రయత్నించారు. వాహనదారులు సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తులను గ్రామస్థులకు నిర్బంధించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కిడ్నాప్‌నకు యత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు