crime news: నిజామాబాద్లో కిడ్నాపైన మూడేళ్ల చిన్నారి క్షేమం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఓ షాపింగ్మాల్ వద్ద అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఓ షాపింగ్మాల్ వద్ద అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు పాపను వదిలి వెళ్లారు. పాపను గుర్తించిన పోలీసులు నిజామాబాద్ తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు.
కిడ్నాప్ జరిగిందిలా..
జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన నూరేన్ తన తల్లి, మూడేళ్ల కూతురు అస్కియా హనీతో కలిసి ఉదయం నిజామాబాద్ నగరానికి వస్త్రాల కొనుగోలు కోసం వచ్చారు. కుటుంబీకులు షాపింగ్ ముగించుకొని బిల్లు చెల్లిస్తున్న సమయంలో చిన్నారి అస్కియా మాయమైంది. తన కూతురు కనిపించకపోవడంతో తల్లి షాపింగ్మాల్ సిబ్బందికి తెలపగా అంతటా వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఓ మహిళ బుర్ఖాలో వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్తున్నట్లు దృశ్యాలు కనిపించాయి. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలింపు చేపట్టారు. చిన్నారి అదృశ్యమైన రెండ్రోజుల తర్వాత కూడా ఆచూకీ లభించలేదు. ఈ కేసులో నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్పోస్టుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని జల్లెడ పట్టారు. అయినా చిన్నారికి సంబంధించిన ఒక్క ఆధారమూ దొరకలేదు. చివరికి ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు పాపను వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్