Saidabad: రాజు మృతిపై ఎలాంటి అనుమానాలొద్దు: డీజీపీ

సైదాబాద్‌ హత్యాచార ఘటన నిందితుడు పల్లకొండ రాజు మృతిపై ఎలాంటి అనుమానాలకూ తావు లేదని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు..

Published : 18 Sep 2021 01:09 IST

హైదరాబాద్‌: సైదాబాద్‌ హత్యాచార ఘటన నిందితుడు పల్లకొండ రాజు మృతిపై ఎలాంటి అనుమానాలకూ తావు లేదని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజు కుటుంబసభ్యులు, పలు ప్రజా సంఘాలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలపై డీజీపీ స్పందించారు. రాజు ఆత్మహత్యపై ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామన్నారు.

‘‘గ్యాంగ్‌మన్‌ కూడా నిందితుడు ట్రాక్‌పై తిరగడం చూశారు. రాజు రైలు కింద పడటం రైతులు సహా ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు చూశారు. కోణార్క్‌ రైలు లోకో పైలట్లు రాజు ఆత్మహత్యకు ప్రత్యక్ష సాక్షులు. ఈ ఘటనలో ఎలాంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిరాధార ఆరోపణలు తగదు’’ అని డీజీపీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని