Kakinada: కాకినాడలో కారు దగ్ధం..వృద్ధ దంపతులు సురక్షితం

ఆగి ఉన్న కారులో మంటలో చెలరేగి దగ్ధమైన ఘటన ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జడ్పీ సెంటర్‌లో చోటు చేసుకుంది. ..

Published : 09 Aug 2021 01:06 IST

మసీదు సెంటర్‌(కాకినాడ): ఆగి ఉన్న కారులో మంటలో చెలరేగి దగ్ధమైన ఘటన ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జడ్పీ సెంటర్‌లో చోటు చేసుకుంది. ఆ సమయంలో కారులో ఇద్దరు వృద్ధ దంపతులు ఉండగా సమీపంలో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాకినాడ డీఎస్పీ భీమారావు, ట్రాఫిక్‌ డీఎస్పీ మురళీకృష్ణ ఘటనాస్థలికి చేరుకుని రాజమహేంద్రవరానికి చెందిన వృద్ధ దంపతులను పరామర్శించారు. సాంకేతిక లోపం కారణంగా కారులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. బాధితులు రాజమహేంద్రవరానికి చెందిన రిటైర్డ్‌ ఎండోమెంట్‌ అధికారి రాజేంద్రన్‌ దంపతులుగా పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని