AP News: మహిళలు ఎరగా వ్యక్తుల అర్ధనగ్న ఫొటోలు.. బెదిరిస్తున్న ముఠా అరెస్టు

అర్ధనగ్న ఫొటోలు అడ్డు పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు.

Published : 24 Aug 2021 01:40 IST

కర్నూలు: అర్ధనగ్న ఫొటోలు అడ్డు పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా ఉన్న బంగారుపేటకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తులు మహిళల ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తులను ఇంటికి పిలిపించుకొని మహిళలు అర్ధనగ్న ఫొటోలు తీస్తారు. అనంతరం ఆ ఫొటోలను అడ్డు పెట్టుకొని నిందితులు డబ్బు కోసం బాధితులను బెదిరిస్తారని విచారణలో తేలింది.
ఈ ముఠా 20 రోజుల్లో ఇద్దరిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక లేబర్‌ కాలనీకి చెందిన వ్యక్తి నుంచి రూ.1.20 లక్షలు, రామ్‌రహీంనగర్‌వాసి నుంచి రూ.8లక్షల విలువైన చెక్కులు వసూలు చేసినట్లు చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని