Crime News: సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలిక అనుమానాస్పద మృతి.. స్థానికుల ఆందోళన

నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. పక్కింట్లో నివసించే రాజు

Published : 11 Sep 2021 02:43 IST

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. పక్కింట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

బాలికపై రాజు అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటాడని.. నిందితుడిని తమకు అప్పగించాలని కాలనీవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ చంపాపేట్‌ రహదారిపై సింగరేణి కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. స్థానికుల ఆందోళన కొనసాగుతున్న క్రమంలో కాలనీవాసులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాలిక మృతి, స్థానికుల ఆందోళన నేపథ్యంలో సింగరేణి కాలనీలో భారీగా పోలీసులు మోహరించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని