Crime News: అనంతపురం జిల్లాలో కర్ణాటక యువతి ఆత్మహత్య

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కణేకల్లు వద్ద హెచ్‌ఎల్‌సీలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి ఐశ్వర్య మృతదేహం లభ్యమైంది. ప్రేమికుడితో వివాహం చేయకుండా జాప్యం చేస్తున్నారనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఐదు రోజుల క్రితం....

Published : 29 Nov 2021 01:14 IST

అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కణేకల్లు వద్ద హెచ్‌ఎల్‌సీలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి ఐశ్వర్య మృతదేహం లభ్యమైంది. ప్రేమికుడితో వివాహం చేయకుండా జాప్యం చేస్తున్నారనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఐదు రోజుల క్రితం బళ్లారిలోని ఇంటి నుంచి ఐశ్వర్య వెళ్లినట్లు తెలుస్తోంది. మృతురాలు ఐశ్వర్య బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని