Bihar: ఒకే కుటుంబంలోని నలుగురిని ఉరితీసిన మావోయిస్టులు
బిహార్లో నక్సలైట్లు దారుణానికి పాల్పడ్డారు. ఓకే కుటుంబానికి చెందిన నలుగురిని ఇంటి బయటే ఉరితీశారు. గయాలోని మౌన్బార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.....
గయా: బిహార్లో నక్సలైట్లు దారుణానికి పాల్పడ్డారు.ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఇంటి బయటే ఉరితీశారు. గయాలోని మౌన్బార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓకే కుటుంబానికి చెందిన నలుగురిని నక్సలైట్లు ఉరి తీసి హత్య చేశారు. అనంతరం వారి ఇంటిని బాంబులతో పేల్చారు. ఈ కుటుంబంలోని వ్యక్తులు పోలీసు ఇన్ఫార్మర్లుగా వ్యవరిస్తున్నారని నక్సలైట్లు గ్రామంలో పోస్టర్లు అంటించారు. పోలీసులకు వీరు సమాచారం ఇవ్వడంతోనే గతంలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని, అందుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఈ చర్యకు పాల్పడినట్లు ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో మావోయిస్టులు శనివారం ఇద్దరు గ్రామస్థులను కాల్చి చంపారు. బాధితులు పోలీస్ ఇన్ఫార్మర్లనే అనుమానంతోనే మావోయిస్టులు వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. బైహర్ పోలీస్స్టేషన్పరిధిలోని మాలిఖేడి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామస్థులు పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఘటనా స్థలంలో మావోయిస్టులు కరపత్రాలు వదిలివెళ్లారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.