NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. కీలక దస్త్రాలు స్వాధీనం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లా్ల్లో మొత్తంగా 14 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేసింది.

Updated : 19 Nov 2021 17:17 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లా్ల్లో మొత్తంగా 14 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేసింది. ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఎన్ఐఏ ఈ సోదాలు నిర్వహించింది. ఏపీలోని ప్రకాశం, విశాఖ, కృష్ణా జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. తెల్లవారుజామున 5 గంటలకు సోదాలు మొదలుపెట్టిన ఎన్ఐఏ.. పలు కీలక దస్త్రాలు, విప్లవ సాహిత్యం, డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని