Road Accident: ఆర్టీసీ బస్సు- ఆటో ఢీ.. ముగ్గురి దుర్మరణం

నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం మద్దిమడుగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 20 Sep 2021 01:45 IST

అమ్రాబాద్‌ : నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం మద్దిమడుగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు, క్షతగాత్రుల కథనం ప్రకారం.. మిర్యాలగూడ సమీపంలోని సూర్య తండాకు చెందిన ఓ కుటుంబం శనివారం చిన్నారుల కేశఖండన కోసం మద్దిమడుగు ఆంజనేయస్వామి గుడికి వెళ్లారు. ఆటోలో ఇవాళ తిరుగు పయనమయ్యారు. మద్దిమడుగుకు రెండు కిలోమీటర్ల సమీపంలోకి రాగానే దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని 108 వాహనంలో చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలిసింది. అమ్రాబాద్‌ సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రమాద స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని