Road Accident: ఘోరం.. బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 12 మంది సజీవదహనం!

రాజస్థాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బర్మేర్‌-జోధ్‌పూర్‌ హైవేపై వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో

Updated : 10 Nov 2021 13:29 IST

బర్మేర్‌: రాజస్థాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బర్మేర్‌-జోధ్‌పూర్‌ హైవేపై వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది సజీవదహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులున్నారు. 

ఉదయం 9.55 గంటలకు బస్సు బలోత్రా నుంచి బయల్దేరింది. కాసేపటికే పచపద్ర సమీపంలో హైవేపై రాంగ్‌ రూట్‌లో వస్తోన్న ఓ ట్రక్కు బస్సును ముందునుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఇంజిన్‌ పేలి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు అంతటా మంటలు వ్యాపించాయి. ఈ ఊహించని ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారు. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకుపోయిన 10 మందిని కాపాడారు. ఈ ఘటనలో 12 మంది మంటల్లో సజీవదహనమైనట్లు పోలీసులు తెలిపారు. కొందరు గాయపడగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని