ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న కిలోన్నర బంగారు నగలు స్వాధీనం

జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన

Updated : 15 Aug 2021 04:42 IST

కర్నూలు: జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన షేక్‌ ముస్తాక్‌ హాక్‌ ఆర్టీసీ బస్సులో తెలంగాణలోని గద్వాల నుంచి కర్నూలుకు ఒక కేజీ 447 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని వస్తుండగా సెబ్‌ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సును తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును తాలూకా పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని