Crime news: పుల్లూరులో దారి దోపిడీ.. లారీ డ్రైవర్‌ను బెదిరించి రూ.7లక్షల చోరీ

కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరు సమీపంలో దారి దోపిడీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 11 Sep 2021 09:57 IST

మైలవరం: కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరు సమీపంలో దారి దోపిడీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుల్లూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీని అడ్డగించిన దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. లారీ డ్రైవర్‌ను బెదిరించి రూ.7లక్షల నగదు ఎత్తుకెళ్లారు. నిందితులను ఖమ్మం వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందంతో దుండగుల కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని