TS News: గంటన్నరలో ఏడు దొంగతనాలు
గంటన్నర వ్యవధిలో ఏడు చోట్ల చోరీలకు పాల్పడిన కరుడుగట్టిన స్నాచర్ను
కరుడుగట్టిన గొలుసుదొంగ అరెస్టు
నారాయణగూడ, న్యూస్టుడే: గంటన్నర వ్యవధిలో ఏడు చోట్ల చోరీలకు పాల్పడిన కరుడుగట్టిన స్నాచర్ను మలక్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల విలువ చేసే సొత్తును ఏడు సెల్ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ కమిషనర్ ఎం.రమేశ్, అదనపు డీసీపీ కె.మురళీధర్, మలక్పేట్ ఏసీపీ ఎన్.వెంకటరమణలతో కలిసి నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్, ఎన్టీఆర్ నగర్, ఫేస్-3 ఓ పత్రికలో వార్తా పంపిణీ విభాగంలో సహాయ మేనేజర్గా పని చేస్తున్న గంగపురం నరేందర్ ఈనెల 14న మలక్పేట్ వెళ్లారు. అక్కడ తన విధులు ముగించుకొని కాలినడకన ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. సుమారు ఉదయం 7.20 నిమిషాలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి నరేందర్ చేతిలోని సెల్ఫోన్ను బలవంతంగా లాక్కొని ఆస్మాన్ఘడ్ ప్రాంతం వైపు వెళ్లిపోయాడు. బాధితుడు మలక్పేట్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అదేరోజు గంటన్నర వ్యవధిలో ఏడు చోట్ల చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడు డబీర్పుర షా కాలనీలో ఉండే ముదస్సిర్ అలియాస్ బిపాషా (21)గా పోలీసులు గుర్తించారు. ఇతను బాల్యంలోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. కాచిగూడ రైల్వే పోలీసులకు దొరికిపోయాడు. రోడ్లపై సందుల్లో వెళుతూ.. ఒంటరిగా కనిపించే అమాయక ప్రజలను బెదిరించి సెల్ఫోన్లు, డబ్బులు లాక్కొనిపోతుంటాడు. ఆ తర్వాత రెయిన్ బజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవలే విడుదలైన బిపాషా.. మళ్లీ ప్రణాళికను రచించాడు. తన ప్రణాళిక ప్రకారం 13న ఓ వ్యక్తిని బెదిరించి ద్విచక్రవాహనం తీసుకొని వెళ్లిపోయాడు. 14న రెయిన్బజార్, కాచిగూడ, సైదాబాద్, సరూర్నగర్, మాదన్నపేట్, మలక్పేట్ల్లో 7 సెల్ఫోన్లు ఎత్తుకెళ్లాడని పోలీసులు గుర్తించారు. మలక్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీఐ డి.నానునాయక్ ఆధ్వర్యంలో ఎస్సై సైదులు తమ సిబ్బందితో కేసును పరిష్కరించారు. కమిషనర్ వీరిని అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు