Crime News: గాయని హరిణీరావు తండ్రి అనుమానాస్పద మృతి

గాయని హరిణీరావు తండ్రి ఏకే రావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆయన..

Updated : 25 Nov 2021 14:28 IST

బెంగళూరు‌: గాయని హరిణీరావు తండ్రి ఏకే రావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆయన.. ఇటీవల బెంగళూరు వెళ్లారు. ఈ నేపథ్యంలో యలహంక సమీపంలోని రైల్వేట్రాక్‌పై ఏకే రావు మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఏకే రావు సుజనా ఫౌండేషన్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని