NCRB Report: పెరిగిన ఆత్మహత్యలు.. నిత్యం 418 మంది బలవన్మరణం!
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. వివిధ కారణాలతో గతేడాది మొత్తం లక్షన్నర మందికిపైగా ప్రాణాలు తీసుకున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదిక వెల్లడించింది.
జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదిక వెల్లడి
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ సమయంలో ఆత్మహత్యలు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా మొత్తం లక్షన్నర మందికిపైగా ప్రాణాలు తీసుకున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదిక వెల్లడించింది. నిత్యం 418 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపింది. దేశంలో వివిధ కారణాల వల్ల ప్రాణాలు తీసుకుంటున్న వారిసంఖ్య గతేడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం మరణాలు ఎక్కువ నమోదయ్యాయి. 2019లో మొత్తం లక్షా 39వేల మంది ప్రాణాలు తీసుకోగా 2020లో ఈ సంఖ్య లక్షా 53 వేలకు పెరిగింది. ప్రతి పదిలక్షల జనాభాకు 10.4గా ఉన్న ఆత్మహత్యల రేటు 11.3కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్రలో అత్యధికం..
దేశంలో అత్యధిక ఆత్మహత్యలు మహారాష్ట్రలో చోటుచేసుకున్నాయి. 2020లో అక్కడ 19వేల (19,909) మంది ప్రాణాలు తీసుకున్నారు. తర్వాతి స్థానంలో ఉన్న తమిళనాడులో 16,883 మంది, మధ్యప్రదేశ్లో 14,578, పశ్చిమబెంగాల్లో 13,103, కర్ణాటకలో 12,259 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. దేశంలో గతేడాది ఆత్మహత్యకు పాల్పడిన మొత్తం కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల్లోనే 50.1శాతం ఉన్నాయి. మిగతా 49.9 శాతం మరణాలు మిగిలిన 23 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో సంభవించాయి. అయితే, దేశ జనాభాలో దాదాపు 17 శాతం ఉత్తర్ప్రదేశ్లో ఉండగా అక్కడ ఆత్మహత్యల రేటు (3.1శాతం) కాస్త తక్కువగా ఉండడం ఊరట కలిగించే విషయం. ఇక నగరాల విషయానికొస్తే.. దేశ రాజధాని దిల్లీలో ఎక్కువ ఆత్మహత్యలు (3,142) చోటుచేసుకున్నాయి.
కుటుంబ సమస్యలతోనే ఎక్కువ..
ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం, మహానగరాల్లోనే ఎక్కువ ఆత్మహత్యలు సంభవించాయి. దేశంలో గతేడాది 53 నగరాల్లో 23,855 (14.8) మంది ప్రాణాలు కోల్పోగా.. ఇది జాతీయ సగటు (11.3) కంటే ఎక్కువ. అయితే, బలవన్మరణాలకు కుటుంబ సమస్యలే ప్రధాన కారణమని తాజా నివేదిక పేర్కొంది. గతేడాది ప్రాణాలు కోల్పోయిన బాధితుల్లో 33.6 శాతం కుటుంబ సమస్యలతోనే ప్రాణాలు విడిచారు. అనారోగ్యం కారణాలతో 18 శాతం, వివాహానికి సంబంధించిన సమస్యలతో 5 శాతం మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. ఇక ఆత్మహత్యలకు పాల్పడిన బాధితుల్లో 70.9 శాతం మంది పురుషులే కాగా.. 29.1 శాతం మహిళలు ఉన్నారు.
ఏడాదిలోనే 10శాతం పెరిగిన ఆత్మహత్యలు..
ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా రోజువారీ కూలీలు, స్వయం ఉపాధి, గృహిణిలే ఎక్కువగా ఉన్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2016లో దేశవ్యాప్తంగా 1,31,008 మంది ప్రాణాలు తీసుకోగా 2017లో ఆ సంఖ్య లక్షా 29 వేలకు తగ్గింది. అనంతరం తదుపరి సంవత్సరాల్లో ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2018లో 1,34,516 మంది, 2019లో 1,39,123 మంది ఆత్మహత్యకు పాల్పడగా 2020లో ఏకంగా లక్షా 53వేల మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. మునుపటి ఏడాదితో పోలిస్తే ఏకంగా పదిశాతం ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగించే విషయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్