Crime News: ఈ దొంగకు దైవభక్తి చాలా ఎక్కువ.. చోరీ దృశ్యాలు వైరల్‌

దొంగతనాలు చేసే వారికి దేవుడంటే భయం ఉంటుందా?అదీ .. దేవాలయాల్లో చోరీ చేసి మరీ భయ భక్తులు నటించిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది...

Updated : 04 Nov 2021 16:41 IST

ఖమ్మం: దొంగతనాలు చేసే వారికి దేవుడంటే భయం ఉంటుందా?అదీ .. దేవాలయాల్లో చోరీ చేసి మరీ భయంభక్తితో నటించిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం శివారు కై కొండయ్యగూడెం  అంకమ్మ ఆలయంలో గత నెల 29వ తేదీ రాత్రి దొంగతనం జరిగింది. సొత్తు చోరీ చేసేముందు దొంగ అమ్మవారి కాళ్లు పట్టుకుని క్షమించమని వేడుకున్నాడు. ‘హారతి ఇస్తానమ్మా.. క్షమించు’ అని ఓ వైపు భయం.. భయంగా వేడుకుంటూనే.. మరో వైపు హుండీలో ఉన్న డబ్బులు మొత్తం కాజేశాడు. ఈదృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. సీసీ ఫుటేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సీసీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు ఆరాతీస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని