Crime News: మెదక్‌ జిల్లాలో విషాదం.. కలుషితాహారం తిని ఇద్దరు చిన్నారుల మృతి

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. కలుషితాహారం తిని ఇద్దరు చిన్నారులు మృతిచెందగా..

Updated : 17 Aug 2021 15:51 IST

తూప్రాన్: అనుమానాస్పద స్థితిలో అక్కాతమ్ముడు మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌ మండలంలో వెలుగుచూసింది. ఎస్సై రాజు తెలిపిన వివరాల మేరకు.. తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్‌, బాలామణి దంపతులు తమ ఇద్దరు పిల్లలు మనీషా(13), కుమార్‌(10)లతో కలిసి మనోహరాబాద్‌లోని ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి మల్లేశ్‌, బాలామణి ఇద్దరు పిల్లలతో కలిసి కోళ్ల ఫారంలో పెంచుతున్న కోళ్లను వండుకొని తిన్నారు. ఆ సమయంలో శీతల పానీయం సేవించారు. భోజనం అనంతరం అంతా నిద్రపోయారు. ఉదయానికి పిల్లలు ఇద్దరూ అపస్మారకస్థితిలో ఉండటం గమనించిన మల్లేశ్ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి బాలామణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని