Crime news: కృష్ణానదిలో దూకి వార్డు వాలంటీరు ఆత్మహత్య

కృష్ణానదిలో దూకి వార్డు వాలంటీరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. తాడేపల్లిలో నిన్న అదృశ్యమైన వాలంటీర్‌ రవికుమార్‌...

Updated : 04 Nov 2021 05:02 IST

తాడేపల్లి: కృష్ణానదిలో దూకి వార్డు వాలంటీరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. తాడేపల్లిలో నిన్న అదృశ్యమైన వాలంటీర్‌ రవికుమార్‌ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు ఇవాళ గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు రవికుమార్‌ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగుల వత్తిడే తన చావుకు కారణమని లేఖలో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని