Crime News: అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. మహిళ సహా ఇద్దరు సజీవదహనం

బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దేవరచిక్కనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో మధ్యాహ్నం గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పై అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్న...

Updated : 22 Sep 2021 12:21 IST

బెంగళూరు: బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దేవరచిక్కనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో మధ్యాహ్నం గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పై అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్న మహిళ సహా ఇద్దరు సజీవదహనం అయ్యారు. మరికొంత మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న మూడు అగ్నిమాపక యంత్రాలు మంటలు అదుపు చేస్తున్నాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని