ఇరువర్గాల మధ్య ఘర్షణ: ఒకరి మృతి 

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం రౌతుగూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఎ.బాలు(50)

Updated : 04 Aug 2020 11:28 IST

కొత్తగూడ ‌: మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం రౌతుగూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఎ.బాలు(50) మృతి చెందాడు. భూ వివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ  బాలును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు ఆగ్రహంతో ప్రత్యర్థులకు సంబంధించిన నాలుగు ఇళ్లకు నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రౌతుగూడెం చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు