రూ.30 దొంగతనం: 31 ఏళ్ల తర్వాత అరెస్టు!
అది హరియాణా రాష్ట్రంలోని కైతల్ అనే పట్టణం. తాజాగా స్థానిక కోర్టులో పోలీసులు ఓ వ్యక్తిని ముద్దాయిగా నిల్చుబెట్టారు. అతడు చేసిన నేరం ఏంటో తెలుసా? ఓ రైతు జేబులో నుంచి 30 రూపాయలు దొంగతనం. అది కూడా ఇప్పటి దొంగతనం కాదు.. 31 ఏళ్ల కిందటది. పోలీసులు సైతం
చండీగఢ్: అది హరియాణా రాష్ట్రంలోని కైతల్ అనే పట్టణం. స్థానిక కోర్టులో పోలీసులు ఓ వ్యక్తిని ముద్దాయిగా నిల్చొబెట్టారు. అతడు చేసిన నేరం ఏంటో తెలుసా? ఓ రైతు జేబులో నుంచి 30 రూపాయలు దొంగతనం. అది కూడా ఇప్పటి దొంగతనం కాదు.. 31 ఏళ్ల కిందటిది. పోలీసులు సైతం అప్పుడే అతడిని అరెస్టు చేశారు. దీంతో జైలుకెళ్లి బయటకు వచ్చాడు. మూడు దశాబ్దాల తర్వాత పోలీసులు అతడిని తిరిగి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసు భలే విచిత్రంగా ఉంది కదా..! పూర్తి వివరాల్లోకి వెళితే..
1990 డిసెంబర్ 3న జస్వంతి గ్రామానికి చెందిన కరమ్ సింగ్ అనే రైతు జేబులో నుంచి ఓ దొంగ రూ.30 ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు కైతల్ పట్టణంలోని సదార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని అదే రోజు దొంగను పట్టుకున్నారు. దొంగ పేరు సుభాష్గా గుర్తించారు. అతడి నుంచి రూ.30 స్వాధీనం చేసుకొని జైలుకు పంపించగా.. మరుసటి రోజే సుభాష్ బెయిల్పై బయటకు వచ్చాడు. నిబంధనల ప్రకారం నిందితులు బెయిల్పై బయటకొచ్చినా.. పోలీసులు ఎప్పుడు పిలిచినా వచ్చేలా అందుబాటులో ఉండాలి. కానీ, సుభాష్ అక్కడి నుంచి పారిపోయి తిరిగి పోలీస్ స్టేషన్కు వెళ్లలేదు. దీంతో 1996లో సుభాష్ను పారిపోయిన నేరస్థుల జాబితాలో చేర్చారు.
అయితే, కొన్ని రోజుల కిందట కైతల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు పారిపోయిన నేరస్థులను తిరిగి అదుపులోకి తీసుకునే కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో పలు చోట్ల దాడులు చేసి నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 31 ఏళ్ల కిందట రూ.30 దొంగతనం చేసిన సుభాష్ కూడా ఉన్నాడు. బుధవారం పోలీసులు అతడిని కోర్టులో హాజరుపర్చారు. దీంతో సుభాష్ తన తప్పును ఒప్పుకున్నాడు. జైల్లో ఒక రోజు కూడా ఉన్నానని చెప్పాడు. దీంతో అతడు చేసిన నేరానికి ఒక రోజు జైల్లో ఉండటం వల్ల అప్పుడే శిక్షకాలం ముగిసిందని, ఇప్పుడు సుభాష్ను విడుదల చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం 52ఏళ్లు ఉన్న సుభాష్ 21ఏళ్ల వయసులో ఆ దొంగతనం చేశాడు. ఆ తర్వాత అతడు వివాహం చేసుకొని జీవనం కొనసాగించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!