మోస్ట్వాంటెడ్ భలే దొరికాడు..!
కశ్మీర్ పోలీసులకు నేడు బాగా కలిసొచ్చింది.. కశ్మీర్లో బుర్హాన్ వానీ తర్వాత ఆ స్థాయి ఉగ్రవాదిగా పేరున్న మెహ్రాజుద్దీన్ హల్వాయి అనుకోకుండా దొరికాడు. 2013 నుంచి దళాలు
నాటకీయంగా మెహ్రాజుద్దీన్ హల్వాయి ఎన్కౌంటర్
ఇంటర్నెట్డెస్క్
కశ్మీర్ పోలీసులకు నేడు బాగా కలిసొచ్చింది.. కశ్మీర్లో బుర్హాన్ వానీ తర్వాత ఆ స్థాయి ఉగ్రవాదిగా పేరున్న మెహ్రాజుద్దీన్ హల్వాయి అనుకోకుండా దొరికాడు. 2013 నుంచి దళాలు అతని ఆచూకీ కోసం వెతుకున్నాయి. నేడు రోడ్డుపై తారసపడ్డాడు. సరే దొరికాడు కదా అని ఇంటరాగేషన్ చేశారు. తన స్థావరం చూపిస్తానని భద్రతా దళాలను నమ్మించి ఓ చోటకు తీసుకుపోయాడు. అక్కడ సమీపంలో దాచిన ఆయుధాన్ని తీసి కాల్పులు జరపడంతో దళాలు ప్రతిదాడి చేయడంతో హతమయ్యాడు. ఇటీవల కాలంలో కశ్మీర్లోని దళాలకు లభించిన అతిపెద్ద విజయంగా ఐజీపీ విజయ్కుమార్ ట్వీట్ చేశారు.
కొవిడ్ నాకాబందీలో..
పోలీసులు, సశస్త్రసీమాబల్, ఇతర దళాలు మంగళవారం కొవిడ్-19 నిబంధనల అమలును పరిశీలించేందుకు హండ్వార వద్ద నాకాబందీ నిర్వహించాయి. ఒక చోట చాలా వాహనాలు ఉండటంతో దళాలు అక్కడికి వెళ్లాయి. దానికి సమీపంలో ఒక పాదచారి అనుమానాస్పదంగా ప్రవర్తించడాన్ని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశాయి. ఒక గ్రెనేడ్ దొరికింది. వెంటనే అతన్ని సమీపంలోకి పోలీస్ పోస్టుకు తరలించి ప్రశ్నించడం మొదలుపెట్టాయి. అతని పేరు తెలుసుకొని అవాక్కవ్వడం దళాల వంతైంది. ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నహిజ్బుల్ కమాండర్ మెహ్రాజుద్దీన్ అతనే ధ్రువీకరించుకొన్నారు. అతని స్థావరం వివరాలు తెలుసుకొని దానిని ధ్రువీకరించుకొనేందుకు వెంట తీసుకెళ్లాయి. అక్కడికి వెళ్లగానే అతను సమీపంలో దాచిన ఏకే-47ను బయటకు తీసి దళాలపై కాల్పులు జరిపాడు. దీంతో దళాలు ప్రతిదాడి చేయడంతో చనిపోయాడు. అక్కడి నుంచి ఏకే-47, నాలుగు మ్యాగ్జైన్లలో తూటాలు, పవర్ బ్యాంక్,ఔషధాలు స్వాధీనం చేసుకొన్నారు.
ఎవరీ మెహ్రాజుద్దీన్..?
12వ తరగతి వరకు చదువుకొన్న మెహ్రాజుద్దీన టెక్నాలజీ వాడటంలో దిట్ట. కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా చేశాడు. 2011లో ఉగ్రవాదిగా మారాడు. టెక్నాలజీని వాడుకొని పోలీసులనుంచి తప్పించుకొనేవాడు. 2015 నాటికే ఉత్తర కశ్మీర్లో బాగా చురుగ్గా ఉన్నాడు. పోలీసుల వేట పెరగడంతో కొన్నాళ్లు పాకిస్థాన్లో తలదాచుకొని వచ్చాడు. ఇక దక్షిణ కశ్మీర్లో బుర్హాన్ వానీ వలే మెహ్రాజుద్దీన్ ఉత్తర కశ్మీర్లో యువతను ఉగ్రవాదంలోకి లాగుతుంటాడు. అతడిని పోలీసులు ఏ++ కేటగిరి ఉగ్రవాదిగా ప్రకటించారు. కశ్మీర్లో టాప్ 10 ఉగ్రవాదుల్లో ఇతను ఒకడు.
భద్రతా సిబ్బంది.. ప్రజలే లక్ష్యంగా..
మెహ్రాజుద్దీన్ భద్రతా సిబ్బంది, సాధారణ ప్రజలను లక్ష్యంగాచేసుకొని దాడులు చేసేవాడు. 2013లో అతను చెలరేగిపోయాడు. పలు హత్యలు చేశాడు. ఎస్పీవో ముదాసిర్ అహ్మద్ దార్ హత్య, అదే ఏడాది నలుగురి పోలీసుల హత్య, హబీబుల్ మీర్ అనే వ్యక్తిని చంపాడు. హరియత్ కార్యకర్త ఆల్తాఫ్ హత్య కూడా అతని పనే. మాజీ ఉగ్రవాది మెహ్రాజుద్దీన్ దార్ను కూడా ఇతనే చంపాడు. శ్రీనగర్లో హిమాల్ హోటల్పై దాడిలో కూడా ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే