కుటుంబంలో చిచ్చురేపిన పేకాట వ్యసనం

అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదంచోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కుమార్తెతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది...

Published : 23 May 2021 01:43 IST

తల్లీ కుమార్తె ఆత్మహత్య

అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదంచోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కుమార్తెతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మీ చెన్నకేశవపురం కాలనీకి చెందిన వీరమ్మ భర్త గోపీ పేకాటకు బానిసై ఇంటిని రూ.10లక్షలకు అమ్మేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన వీరమ్మ.. తొమ్మిదేళ్ల కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లి చెరువులోదూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తల్లీకుమార్తెల మృతదేహాలను చెరువులోంచి వెలికితీశారు. కేసు నమోదు చేసి గోపిని అదుపులోకితీసుకొని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని