mallareddy: సైదాబాద్ హత్యాచార ఘటన: రాజును వదిలిపెట్టే ప్రసక్తేలేదు: మంత్రి మల్లారెడ్డి
సైదాబాద్లో ఆరేళ్ల బాలిక హత్యాచారం ఘటనపై తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్: సైదాబాద్లో ఆరేళ్ల బాలిక హత్యాచారం ఘటనపై తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అత్యాచారం ఘటన చాలా దారుణం. నిందితుడు రాజుకు కఠిన శిక్ష పడేలా చూస్తాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని మంత్రి హెచ్చరించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.
మరో వైపు నిందితుడు రాజుకోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆరు టాస్క్ పోర్స్ బృందాలు, నాలుగు లా అండ్ ఆర్డర్ బృందాలు రాజు కోసం వెదుకుతున్నాయి. ట్యాంక్బండ్ సహా ప్రతి పార్కును క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత రాజు పనిచేసిన కాంట్రాక్టర్ వద్దకు వెళ్లినట్టు గుర్తించారు. గతంలో పనిచేసినందున రావాల్సిన రూ.1800 తీసుకుని ఊరికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయినట్టు తేల్చారు. నిందితుడి వద్ద ఉన్న ఫోన్ స్విచాఫ్ చేసి పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు గుర్తు పట్టకుండా గుండు చేయించుకుని మాస్క్ పెట్టుకుని ఉన్నాడేమో అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. నగరంతో పాటు సైదాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేబర్ అడ్డాలను ప్రత్యేక బృందాలు జల్లెడపడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?